Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..

RC15 సినిమాలో రామ్ చరణ్, కైరా అద్వానీలపై ఓ అద్భుతమైన పాటని చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ పాట కోసం ఏకంగా 20 కోట్లు పైగా ఖర్చు చేయించబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు మొదటి సారి.......

Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..

Rc 15

RC15 :  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలవ్వొచ్చు అని సమాచారం. అయితే ఈ సారి షూటింగ్ షెడ్యూల్ లో ఒక పాటని చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.

ఈ పాటకి శంకర్ భారీగా ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తుంది. మామూలుగానే శంకర్ సినిమాలో పాటలు చాలా గ్రాండ్ గా ఉంటాయి. తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సినిమాలో ఒక పాట చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు శంకర్. ఆ పాటల కోసం బాగా ఖర్చు చేస్తాడు. ఇప్పుడు RC15లో కూడా ఇదే ఫాలో అవుతున్నాడు శంకర్.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్ ట్యూన్ వినిపించేసిన తమన్

RC15 సినిమాలో రామ్ చరణ్, కైరా అద్వానీలపై ఓ అద్భుతమైన పాటని చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ పాట కోసం ఏకంగా 20 కోట్లు పైగా ఖర్చు చేయించబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు మొదటి సారి భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని జీ5 భారీ ధరకి కొనుక్కుంది. ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర బృందం.