వైరల్ అవుతున్న స్టార్స్ 10th క్లాస్ స్కూల్ గ్రూప్ ఫొటో
ముగ్గురు టాలీవుడ్ హీరోల టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ముగ్గురు టాలీవుడ్ హీరోల టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
లాక్డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు టీవీలు, ఓటీటీలతో కాలక్షేపం చేస్తుంటే, సెలబ్స్ తమ రోజువారీ పనుల తాలుకు పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులతో టచ్లో ఉన్నారు. కొత్తగా Throwback Pics పేరుతో వారికి సంబంధించిన ఓల్డ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రాణిస్తున్న ముగ్గురు హీరోలు టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటోలో ఉన్నహీరోలు ఎవరంటే.. రానా దగ్గుబాటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు శిరీష్.. టెన్త్ క్లాస్ ఒకే స్కూల్లో కలిసి చదివిన వీళ్లు ముగ్గురు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. ఈ పిక్ను వీరి అభిమానులు పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.