Aadi SaiKumar : ఆది సాయి కుమార్ హీరోగా, సునీల్ కీ రోల్‌లో సినిమా..

వైవిధ్య‌మైన సినిమాలు, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయి కుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన క‌ళ్యాణ్‌జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది..

Aadi SaiKumar : ఆది సాయి కుమార్ హీరోగా, సునీల్ కీ రోల్‌లో సినిమా..

Aadi Saikumar

Aadi SaiKumar: వైవిధ్య‌మైన సినిమాలు, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయి కుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన క‌ళ్యాణ్‌జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4 గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చింది. ఆది సాయి కుమార్‌ను మ‌రో కొత్త డైమెన్ష‌న్‌లో ప్రెజెంట్ చేసే చిత్ర‌మిది. అలాగే హీరో సునీల్‌ మా చిత్రంలో ఓ కీ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. అదేంట‌నేది సినిమా చూడాల్సిందే. పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి.. సునీల్‌ అయితే బాగుంటుంద‌ని ఆయ‌ణ్ణి కలిసి అడ‌గ్గానే న‌టించ‌డానికి ఒప్పుకున్నందుకు స్పెష‌ల్ థ్యాంక్స్‌.

ఈ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాల‌కు స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్‌ అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలో తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సాంకేతిక వ‌ర్గం..
బ్యాన‌ర్‌: విజన్ సినిమాస్
ద‌ర్శ‌కుడు: క‌ళ్యాణ్‌జీ గోగ‌ణ‌
నిర్మాత‌: నాగం తిరుప‌తి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మ‌ల్ రెడ్డి యాళ్ల‌
సంగీతం: సాయికార్తీక్‌
ఎడిటింగ్‌: మ‌ణికాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: బాల్ రెడ్డి.