‘ఆచార్య’ హైదరాబాద్ చేరుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్-కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి- రామ్ చరణ్ నిర్మాతలు.
Acharya Khammam Schedule: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్-కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి- రామ్ చరణ్ నిర్మాతలు.
ఇటీవల ఖమ్మంలో ఓ షెడ్యూల్ జరిపింది చిత్రబృందం. ఈ షెడ్యూల్లో చిరంజీవి- రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఖమ్మం షెడ్యూల్ ఎలాంటి ఆటంకాల్లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్లో అడుగుపెట్టాం. చిరంజీవి-చరణ్పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించాం’’ అన్నారు..
ఇప్పటికే థియేట్రికల్, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రికార్డ్ రేటుకి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సోనూ సూద్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మే 13న థియేటర్లలోకి రానుంది. తిరు సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.