ముంబైలో యువ నటుడు ఆత్మహత్య.. మర్డర్ అని అంటున్న ఫ్యామిలీ
Akshat Utkarsh death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మరువక ముందే.. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన యువ నటుడు అక్షత్ ఉత్కర్ష్ మృతి కేసు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఫ్లాట్లో అక్షత్ మరణించారు. అయితే అక్షత్ మరణం మర్డర్గా అనుమానిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు.
బీహార్ లోని ముజఫర్పూర్ నివాసి అయిప ఫిల్మ్ ఆర్టిస్ట్ అక్షత్ ఉత్కర్ష్ ముంబైలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతని మృతదేహాన్ని పాట్నా విమానాశ్రయం ముజఫర్పూర్కు, అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్లో తన సొంత గ్రామానికి తీసుకుని వచ్చారు. బంధువులు సికందర్పూర్ ఘాట్లో చివరి కర్మలు పూర్తిచేశారు. ప్రదీప్ శర్మ నటించిన భోజ్పురి చిత్రం లిట్టి చోఖిలో అక్షత్ కలిసి నటించారు.
బీహార్కు చెందిన 26 ఏళ్ల అక్షత్ ఉత్కర్ష్ ఆదివారం ముంబైలోని అంధేరి ప్రాంతంలో అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. అక్షత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని, పని లేకపోవడం వల్ల నిరాశకు గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, అతని కుటుంబం మాత్రం ఇది కచ్చితంగా మర్డర్ అయి ఉండవచ్చునని అనుమానిస్తుంది.
అక్షత్.. ఒక మహిళా స్నేహితురాలితో కలిసి అంధేరిలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తన రూమ్మేట్ స్టేట్మెంట్ ప్రకారం, అక్షత్ ఆదివారం సాయంత్రం యథావిధిగా మాములుగానే ఉన్నాడు అని, ఎప్పటిలాగే వివిధ విషయాల గురించి మాట్లాడినట్లు చెప్పారు. నిద్రపోయే ముందు కలిసి భోజనం చేసినట్లుగా వెల్లడించారు.
రాత్రి 11.30 గంటలకు వాష్రూమ్ను ఉపయోగించటానికి మేల్కొన్నప్పుడు, అక్షత్ తన గదిలో చనిపోయి ఉన్నట్లుగా గుర్తించానని అన్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసినట్లుగా వెల్లడించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆదివారం రాత్రి 10 నుంచి 11:30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్డౌన్ కారణంగా పనులు లేనందున కుటుంబం మరియు స్నేహితుల నుండి డబ్బు తీసుకోవలసి వచ్చిందని, అక్షత్ నిరాశలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో అక్షత్ మరణించినట్లుగా అనుమానిస్తున్నారు.