అమీషాపటేల్‌కు రేప్ చేసి చంపేస్తారేమోనని భయం వేసిందట!!

అమీషాపటేల్‌కు రేప్ చేసి చంపేస్తారేమోనని భయం వేసిందట!!

బాలీవుడ్ నటి Ameesha Patel‌కు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్‌కు వెళ్లి లోక్ జన‌శక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.

అమీషా పటేల్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన పంపిన ఆడియో మెసేజ్ ప్రస్తుతం వైరల్ అయింది. అందులో బీహార్ ప్రచారంలో అమీషా పటేల్ అభద్రతాభావం ఫీల్ అవుతున్నట్లు.. చెప్పింది. ఇదొక పీడ కలలా భావిస్తున్నట్లు ఆమె వివరించింది.

‘నాతో పాటు ఉన్నవాళ్లను చూస్తే భయం వేసింది. కానీ, నాకు ఏ ఛాయీస్ లేకుండా పోయింది. ఎలాగో ప్రయత్నించి ముంబైకి చేరుకున్నా’ అని చెప్పింది. ఆమె చెప్పిన స్టేట్‌మెంట్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి అయిన ప్రకాశ్ చంద్రా ప్రచారం కోసం తనను గెస్ట్ గా పిలిచారని చెప్పారు.

గెస్ట్ గా పిలిచి ప్రచారం జరుగుతున్న సమయంలో బ్లాక్ మెయిల్ చేయడం, భయపెట్టడం, తప్పుగా ప్రవర్తించడం వంటివన్నీ చేసేవాడని వివరించింది. ‘నిన్న సాయంత్రం ముంబైకు చేరుకున్న తర్వాత కూడా అతని నుంచి బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని, అతని గురించి గొప్పగా చెప్పాలన్నాడంటూ తెలిపింది.

తాను మాత్రం నిజాయతీగా తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని బయటపెడుతున్నానంటూ అమీషా పటేల్ వెల్లడించింది. బీహార్ లో తనకు ఫ్లైట్ మిస్ అయ్యేలా కూడా చేశాడని కూడా ఆరోపించింది.

ముంబైకు చేరుకున్న తర్వాత నిజమేంటో ప్రపంచానికి తెలియాలని అనుకుంటున్నట్లు చెప్పింది. నా మీద రేప్ దాడి.. మర్డర్ జరుగుతుందేమోనని భయం వేసింది. అతని తరపు మనుషులు చాలా సార్లు నా కార్ చుట్టుముట్టి ఆపేశారు. కారు ముందుకు వదలడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. నన్ను ట్రాప్ చేశారు. నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. అతని పని ఇలా ఉంది’ అని అమీషాపటేల్ ఆరోపించారు.

ఈ కామెంట్లను ఎల్జేపీ అభ్యర్థి ఒబ్రా ప్రకాశ్ చంద్ర తిప్పికొట్టారు. అమీషా పటేల్ ను ప్రశ్నించేసరికి ఆమె మరోసారి వీడియో చేసి మాకే అనుకూలంగా చేస్తానని చెప్పింది. కాకపోతే దానికి రూ.10లక్షల వరకూ డిమాండ్ చేసింది. నేను చదువుకున్న వ్యక్తిని. ఆమెకు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆమె ఆరోపణలకు ఆధారాల్లేవు’ అని ప్రకాశ్ చంద్ర చెప్పారు.