Sachin Joshi: రాజ్కుంద్రా మరో వివాదం.. ఫలించిన సచిన్ జోషి పోరాటం!
Sachin Joshi: ఒకవైపు నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నీలి చిత్రాల వ్యవహారం బీ టౌన్ ఇండస్ట్రీని కుదిపేస్తుండగానే కుంద్రా బిజినెస్ వివాదాలు.. పలు విధాలుగా బాధితులుగా మారిన వారు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు. నటుడు, నిర్మాత సచిన్ జోషి కూడా ఇందులో తాను కూడా బాధితుడినే అని బయటకి వచ్చారు. రాజ్ కుంద్రా, అతనికి చెందిన సంస్థ సట్యుగ్ గోల్డ్ సంస్థ చేతిలో మోసపోయినట్లు సచిన్ జోషి తెలిపాడు.
అంతేకాదు, ఈ మేరకు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసులో సచిన్ జోషి విజయం సాధించినట్లు తెలిపాడు. సచిన్ ఒఫి గోల్డ్ స్కామ్పై అలాగే రాజ్కుంద్రా, శిల్పాశెట్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో భాగంగా జోషికి బంగారం అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు అయ్యే ఖర్చుగా రూ.3,00,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సచిన్ జోషి మాట్లాడుతూ.. చివరికి ఖర్మ ఫలితంగా తన న్యాయ పోరాటం గెలిచిందన్నారు.
ఈ కేసులో రాజ్ కుంద్రా ఆరు సంవత్సరాల క్రితం తమకు అప్పగించాల్సిన ఒక కిలో బంగారాన్ని, చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సి ఉందని.. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము ను ఓ ప్రముఖుడిని నమ్మి పెట్టుబడిగా పెట్టి మోసపోయానని.. తనలా ఎవరూ మోసపోకుకూడదనే పోరాటం చేశానని.. చివరికి ఇప్పుడు తాను గెలిచానని, రాజ్ కుంద్రా మోసం బట్ట బయలు అయిందని వెల్లడించారు.