ఫ్యాన్స్ కోసం ప్రాణం పోతున్నా చివరి మెసేజ్

ఫ్యాన్స్ కోసం ప్రాణం పోతున్నా చివరి మెసేజ్

యాక్టర్-సింగర్ దివ్య చౌస్కీ ఆదివారం తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడిన ఆమె 28ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈ యాక్టర్ తొలి సినిమా 2016లో హాయ్ అప్నా దిల్ తో ఆవారాకు డైరక్షన్ చేసిన మంజోయ్ ముఖర్జీ భోపాల్ లో చనిపోయిందని తెలిపి సంతాపం వ్యక్తం చేశారు.

‘సంవత్సరంన్నరగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఓ సారి తగ్గింది. కానీ, మళ్లీ పెరిగింది. ఈ సారి ఆమె క్యాన్సర్ ను జయించలేకపోయింది. ఇవాళ భోపాల్ లోనే తుది శ్వాస విడిచింది. తొలి సినిమాలో మాతో కలిసి పనిచేసి అద్భుతమైన జ్ఞాపకాలు నమోదు చేసింది.

చనిపోవడానికి ముందు రోజు దివ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. ‘నేను చెప్పాలనుకునే దానికి మాటలు సరిపోవు. మెసేజ్ లతో విసిగిపోయాను. మీకందరికీ చెప్పడానికి ఇదే సరైన సమయం. నేను డెత్ బెడ్ మీద ఉన్నా. దారుణం జరిగింది. అయినా నేను స్ట్రాంగ్ గానే ఉన్నా. బాధలు లేని జీవితంలో ఉంటా. ప్రశ్నలు అడగొద్దు. దేవుడికి ఒక్కడికే తెలుసు మీరంతా నాకెంత ముఖ్యమో’ అని మెసేజ్ స్టోరీ పెట్టింది.

కొన్ని సినిమాల్లో యాక్టర్ గా చేసిన దివ్యా.. 2018లో విడుదలైన పాటియాలే ది క్వీన్ సినిమాకు సింగర్ గా వ్యవహరించారు.