నటి ఖుష్బూ ఇంట్లో విషాదం, కరోనాతో సమీప బంధువు మృతి
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె వదిన కరోనా వైరస్
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె వదిన కరోనా వైరస్
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె వదిన కరోనా వైరస్ తో ముంబైలో మృతి చెందారు. దీంతో, ఖుష్బూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన వదిన చనిపోయిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రాణాంతక వ్యాధి కారణంగా ఆమె మరణించారని చెప్పారు. తమకు దూరంగా ఈ లోకం నుంచి ఆమె వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరి చూపు కూడా దక్కలేదు:
లాక్ డౌన్ నేపథ్యంలో వదిన అంత్యక్రియలకు ఖుష్బూ వెళ్లలేకపోయారు. చెన్నై నుంచి ముంబై వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో చివరి చూపు కూడా దక్కలేదు. ఖుష్బూ ఇంట్లో నెలకొన్న విషాదంపై పలువురు తమిళ సినీ ప్రముఖులు స్పందించారు. ఖుష్బూ వదిన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఖుష్భూని ఓదార్చారు.
భారత్ లో కరోనా విలయతాండవం:
ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ 8వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. ఇక మరణాల సంఖ్య 5వేలు దాటేసింది. లాక్డౌన్ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 62 వేల మందికిపైగా కరోనా బాధితులుండగా వారిలో 2వేల మందికి పైగా మృతి చెందారు. కంటికి కనిపించని ఈ శత్రువు కారణంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. కాగా, రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనున్నాయనే నిపుణుల హెచ్చరికలు దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే కరోనా ముప్పు తప్పదని చెప్పడంతో ప్రజలంతా వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
Very unfortunately my eldest sis-in-law lost her cousin to #Covid-19 in Mumbai.. it’s painful.
— KhushbuSundar ❤️ (@khushsundar) May 30, 2020