సునిషిత్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని సునిషిత్ అనే వ్యక్తిపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

  • Published By: sekhar ,Published On : March 17, 2020 / 10:55 AM IST
సునిషిత్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని సునిషిత్ అనే వ్యక్తిపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. తనపై సునిషిత్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆమె పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. వివరాళ్లోకి వెళ్తే.. సునిషిత్ (Sacrificing Star) అనే వ్యక్తి గతకొంత కాలంగా పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వూలిస్తూ.. తను మహేష్ బాబుకి బ్రేక్ ఇచ్చానని, ‘1-నేనొక్కడినే’ సినిమాలో మొదట తానే హీరోనంటూ.. పలువురు సెలబ్రిటీల గురించి రకరకాలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

అతని మాటలు వింటే మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడని, అతని మాటలు వింటుంటే మాకు పిచ్చెక్కుతుందంటూ కామెంట్స్ చేశారు. సునిషిత్ ఓ ఇంటర్వూలో లావణ్య త్రిపాఠితో తాను డేటింగ్ చేశానని, పెళ్లి చేసుకున్నానని, తర్వాత విడిపోయామని చెప్పుకొచ్చాడు.

Read Also : పోలీసులు వేధిస్తున్నారంటూ కోర్టుకు కమల్..

ఈ విషయం లావణ్య దృష్టికి వెళ్లడంతో మొదట షాకైన ఆమె సునిషిత్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునిషిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నాడని అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

లావణ్య ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ: ‘‘యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిషిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని తెలిపారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిషిత్‌ ఇతర సెలబ్రిటీలపైన కూడా వ్యాఖ్యలు చేశారని అయితే ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని, ఆమె కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని’’ వెల్లడించారు.