చిత్ర హింసలు పెట్టారు : బిగ్ బాస్ పై పోలీసులకు ప్రముఖ నటి ఫిర్యాదు

తమిళ బిగ్ బాస్ సీజన్-3 చుట్టూ వివాదం ముదురుతోంది. ప్రముఖ సినీ హాస్యనటి మధుమిత బిగ్ బాస్ షో నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు. ఈ షో ని హోస్ట్ చేసే కమల్ హాసన్

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 05:29 AM IST
చిత్ర హింసలు పెట్టారు : బిగ్ బాస్ పై పోలీసులకు ప్రముఖ నటి ఫిర్యాదు

తమిళ బిగ్ బాస్ సీజన్-3 చుట్టూ వివాదం ముదురుతోంది. ప్రముఖ సినీ హాస్యనటి మధుమిత బిగ్ బాస్ షో నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు. ఈ షో ని హోస్ట్ చేసే కమల్ హాసన్

తమిళ బిగ్ బాస్ సీజన్-3 చుట్టూ వివాదం ముదురుతోంది. ప్రముఖ సినీ హాస్యనటి మధుమిత బిగ్ బాస్ షో నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు. ఈ షో ని హోస్ట్ చేసే కమల్ హాసన్ పైనా ఆమె కంప్లయింట్ ఇచ్చారు. బిగ్ బాస్ లో తనను చిత్రహింసలు పెట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్యకి యత్నించాను అని చెప్పారు. షో లో ఏం జరుగుతుందో కమల్ హాసన్ కి అంతా తెలుసన్నారు. అన్ని విషయాలు తెలిసినా కమల్ మౌనంగా ఉన్నారని మధుమిత వాపోయారు. తనను కావాలనే బిగ్ బాస్ షో నుంచి తప్పించారని మధుమిత ఆరోపించారు.

బిగ్ బాస్ హౌస్ కంటెస్టంట్ గా ఉన్న సమయంలో మధుమిత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 50 రోజులకు పైగా గడిపిన మధుమిత.. హౌస్‌ లీడర్‌గానూ వ్యవహరించింది. ఆ సమయంలో కావేరి వివాదంపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇతర పోటీదారులకు కోపం తెప్పించింది. ఇరువురికి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. తీవ్ర మనస్తాపం చెందిన మధుమిత తన ఎడమచేతి మణికట్టుపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పంపేశారు.