వాళ్ల దెబ్బకి పెళ్లంటేనే భయమేస్తుంది..

  • Published By: sekhar ,Published On : July 30, 2020 / 04:50 PM IST
వాళ్ల దెబ్బకి పెళ్లంటేనే భయమేస్తుంది..

తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ, తనకు పెళ్లంటే భయం వేస్తుందని తెలిపింది. ఇటీవల పూర్ణను ఓ ముఠా వివాహం పేరిట మోసం చేసిన వ్యవహారం సినీవర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

ఈ విషయమై పూర్ణ మాట్లాడుతూ..‘‘నాకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించి, వరుడి కోసం విచారిస్తున్నారు. ఆ సమయంలో ఓ ముఠా మా తల్లిదండ్రులను సంప్రదించింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకొని వివాహానికి అంగీకరించాయి. వివాహానికి అంగీకరించిన తాను తదుపరి జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని ఇద్దరం చర్చించుకున్నాము.

అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ముఠా తమతో ప్రేమతోను, అభిమానంతోను వ్యవహరించి మోసం చేశాయి. వారి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఇప్పట్లో నాకు వివాహం వద్దని తల్లిదండ్రులతో చెప్పాను. వివాహం అంటేనే నాకు భయం వేస్తుంది. ఈ దిగ్ర్భాంతి పరిస్థితుల నుంచి కోలుకొని నటనపై దృష్టి సారిస్తున్నాను’’.. అంటూ ఆందోళన వ్యక్తం చేసింది పూర్ణ.