గ్రీన్ ఇండియా ఛాలెంజ్- మొక్కలు నాటిన రాశీఖన్నా, ప్రశాంత్ వర్మ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి హీరోయిన్ రాశీఖన్నా మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అలాగే తనను ఈ ఛాలెంజ్కు నామినేట్ చేసిన రష్మిక మందన్నాకు థ్యాంక్స్ తెలిపింది రాశీ. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నాలను ఈ ఛాలెంజ్కు నామినేట్ చేసింది రాశీఖన్నా. అంతే కాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అందరూ భాగమై మొక్కలు నాటాలని, ఈ చెయిన్ను ఇలాగే కొనసాగించాలని కోరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 వ విడత లో భాగంగా ‘RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన ఆఫీస్ ప్రాంగణంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మొక్కలు నాటారు..
హీరోలు నాని, రవితేజ, రాజశేఖర్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ప్రశాంత్ వర్మ.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు..