Adipurush : పక్కా పాన్లింగ్.. అనుకున్న టైంకే ‘ఆదిపురుష్’
‘ఆదిపురుష్’ సినిమాను 2020 ఆగస్టు 18న అనౌన్స్ చేశారు.. మొత్తం 108 రోజుల్లో షూట్ కంప్లీట్ అయిపోయింది..
Adipurush: రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’.. డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్, భీముడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్లో అనసూయ!
పక్కా ప్లానింగ్తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ఓం రౌత్ షూటింగ్ జెట్ స్పీడ్తో చేస్తున్నారు. ఇటీవలే, సైఫ్, కృతి, ప్రభాస్ వంటి మెయిన్ లీడ్స్ తమ పోర్షన్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేశారు. రీసెంట్గా ‘ఆదిపురుష్’ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేరె చేశారు ‘ఆదిపురుష్’ టీమ్.
Jai Bhim : నిజాయితీగా తీస్తే నెత్తిన పెట్టుకుంటారు..
‘ఆదిపురుష్’ సినిమాను 2020 ఆగస్టు 18న అనౌన్స్ చేశారు. 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అదే నెలలో ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. నవంబర్ 3 నాటికి ప్రభాస్ పార్ట్ షూట్ కంప్లీట్ చేశారు. మొత్తం 108 రోజుల్లో షూట్ పూర్తి చేసేశారు.
Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..
పక్కా ప్లానింగ్తో ఎలాంటి ఆటకం రాకుండా అనుకున్న టైంకి షూట్ ఫినిష్ చేశారు ఓం రౌత్ అండ్ టీమ్. మరో పది నెలలపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగనున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని ఒక గ్రాండ్ విజువల్ వండర్ను ‘ఆదిపురుష్’ రూపంలో 2022 ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Annaatthe : 200 కోట్ల దిశగా రజినీ సినిమా! ఇదీ సూపర్స్టార్ స్టామినా..