Adipurush : ఆదిపురుష్ పండగ స్పెషల్ పోస్టర్.. ఈ సారి కూడా ట్రోల్స్ తప్పలేదుగా..

తాజాగా నేడు శ్రీరామనవమి కావడంతో గత వారం రోజులుగా ఆదిపురుష్ అప్డేట్ అడుగుతున్నారు ప్రభాస్ అభిమానులు. డైరెక్టర్ ఓం రౌత్ ని, చిత్రయూనిట్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వమని....................

Adipurush : ఆదిపురుష్ పండగ స్పెషల్ పోస్టర్.. ఈ సారి కూడా ట్రోల్స్ తప్పలేదుగా..

adipurush Poster Trolled again by fans and netizens

Adipurush :  బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Krithi Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా రామాయణం(Ramayanam) ఆధారంగా ఆదిపురుష్(Adipurush) ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాం అంటూ ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. టీజర్ పై, చిత్ర యూనిట్, ముఖ్యంగా డైరెక్టర్ పై విమర్శలు వచ్చాయి. రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా తీస్తున్నావా అని, అది అసలు రామాయణంలా ఉందా, హాలీవుడ్ గ్రాఫిక్స్ అంటూ, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విపరీతంగా ట్రోల్ చేశారు.

దీంతో ఆదిపురుష్ సినిమాపై ఉన్న అంచనాలన్నీ పోయాయి. టీజర్ కి వచ్చిన ట్రోల్స్ చూశాక చిత్రయూనిట్ సినిమా రిలీజ్ ని వాయిదా వేసి జూన్ లో రిలీజ్ చేస్తామని చెప్పి మళ్ళీ గ్రాఫిక్ వర్క్ మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఆశలు కూడా వదిలేసుకున్నారు. తాజాగా నేడు శ్రీరామనవమి కావడంతో గత వారం రోజులుగా ఆదిపురుష్ అప్డేట్ అడుగుతున్నారు ప్రభాస్ అభిమానులు. డైరెక్టర్ ఓం రౌత్ ని, చిత్రయూనిట్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వమని అడగడంతో చిత్రయూనిట్ నేడు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

Adipurush: ఎట్టకేలకు ఆదిపురుష్ నుండి అప్డేట్ వచ్చేసింది.. శ్రీరామనవమి గిఫ్ట్ అదిరింది!

ఈ పోస్టర్ లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. ప్రభాస్, కృతి సనన్ తో పాటు, లక్ష్మణుడు, ఆంజనేయుడు క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ కూడా గ్రాఫిక్ పోస్టర్ లాగే ఉండటంతో మరోసారి ఆదిపురుష్ పై ట్రోల్స్ వచ్చాయి. అలాగే అందులో సీతకు మెడలో ఎలాంటి తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి ఫుల్ గడ్డం ఉండటం.. ఇలా అనేక వాటి మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. వీటితో పాటు మళ్ళీ అవే గ్రాఫిక్స్, వీటికంటే ఫ్యాన్స్ చేసినవే బాగుంటాయి కదా అని ట్రోల్ చేస్తున్నారు. తెలుగులోనే కాక బాలీవుడ్ వాళ్ళు కూడా రామాయణం గురించి తెలుసా అంటూ ఓమ్ రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు టీజర్, ఇప్పుడు పోస్టర్స్ మీద ట్రోల్స్ చూశాక అభిమానులు మాత్రం సినిమాపై అంచనాలు పెట్టుకోవట్లేదు మరి జూన్ లో సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతుందో చూడాలి. జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Forever Meme’s (@forevermeme2)