Adipurush: ఆదిపురుష్ టీమ్‌కు కోర్టు నోటీసులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. రామాయణంలోని పాత్రలను ఈ సినిమాలో అవమానించారంటూ పలువురు ఆదిపురుష్ టీమ్‌పై మండిపడుతున్నారు. తాజాగా, ఆదిపురుష్ చిత్ర టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది.

Adipurush: ఆదిపురుష్ టీమ్‌కు కోర్టు నోటీసులు

Adipurush Team Gets Legal Notice

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న చిత్ర యూనిట్, రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆదిపురుష్ టీజర్ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

Adipurush: ఆదిపురుష్​ సినిమా రిలీజ్​పై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్..

అయితే ఈ టీజర్ చూశాక చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు సైతం ఆదిపురుష్ టీమ్‌పై మండి పడుతున్నారు. రామాయణంలోని పాత్రలను ఈ సినిమాలో అవమానించారంటూ పలువురు ఆదిపురుష్ టీమ్‌పై మండిపడుతున్నారు. కాగా, ఇటీవలే ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా, ఆదిపురుష్ చిత్ర టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది.

Adipurush : 3డీలో చూస్తే రావణాసురుడి గెటప్ మారిపోతుందా??.. ఆదిపురుష్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి..

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందని ఆశిష్ రాయ్ అనే న్యాయవాది ఆదిపురుష్ చిత్ర టీమ్‌కు లీగల్ నోటిసులు జారీ చేశారు. ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్, T-సిరీస్ యజమాని భూషణ్ కుమార్, నటులు సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్, కృతి సనన్‌లకు క్రిమినల్ చర్య కింద సదరు న్యాయవాది లీగల్ నోటీసులు జారీ చేశారు. మరి ఈ లీగల్ నోటీసులపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాను రూ.500 అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.