బాలీవుడ్ సెన్సేషనల్.. ‘మలంగ్’ ట్రైలర్ రిలీజ్
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మలంగ్’. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ను విడుదల చేస్తుంది చిత్రయూనిట్. అందులో భాగంగానే.. మూవీ యూనిట్ ఈ రోజు (జనవరి 7, 2020)న ట్రైలర్ రిలీజ్ చేసింది.
ట్రైలర్ ను బట్టి చూస్తే కథ హంతకుల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్ గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది.
మొత్తానికి ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఇక దిశ.. ఆదిత్య భూజాలు ఎక్కి కూర్చుని, అతడికి కిస్ చేస్తున్న స్టిల్ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీన్లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట చిత్రయూనిట్.