Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..

అడివిశేష్ ఈ ట్వీట్ లో.. ''డియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరు స్పందించిన విధానానికి నా గుండె ప్రేమతో నిండిపోయింది. మీరు టూర్ బిజీ ఉండే సరికి మేజర్ చూసే టైమ్..............

Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..

Pawan Kalyan

Pawan Kalyan :  26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. అడవి శేష్ హీరోగా, శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని భారీ విజయం సాధించింది ఈ సినిమా. పాన్ ఇండియా సినిమాగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది.

ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేజర్ సినిమా యూనిట్ కి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్ సినిమాని, సినిమా యూనిట్ ని, ముఖ్యంగా అడివిశేష్ ని అభినందించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభినందనలపై మహేష్ బాబు స్పందించారు. తాజాగా అడివిశేష్ కూడా దీనిపై స్పందిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.

Saipallavi : విరాటపర్వం ఆత్మీయ వేడుకలో సాయిపల్లవి

అడివిశేష్ ఈ ట్వీట్ లో.. ”డియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరు స్పందించిన విధానానికి నా గుండె ప్రేమతో నిండిపోయింది. మీరు టూర్ బిజీ ఉండే సరికి మేజర్ చూసే టైమ్ ఉంటుందా అనుకున్నాను, మీ నోట్ నన్ను నిజంగా హత్తుకుంది. ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నాకు సర్వస్వం. ఆరోజు పంజా.. ఈరోజు మేజర్. మీ సపోర్ట్ కి నిజంగా కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో చెప్పాలి. నేను వాటిని ఫోన్ లో చెప్పడం కోసం సేవ్ చేస్తాను” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. గతంలో అడివిశేష్ పవన్ కళ్యాణ్ తో కలిసి పంజా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.