Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!

ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తాజా మూవీ ‘మేజర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది....

Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!

Adivi Sesh To Arrange Major Movie Special Show For Pawan Kalyan

Major: ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తాజా మూవీ ‘మేజర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తమకు చాలా స్పెషల్‌గా మారడంతో ఈ సినిమా కోసం వారు ప్రాణం పెట్టి పనిచేసినట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. ఇప్పటికే మేజర్ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రీమియర్ షోలను దేశంలోని పలు నగరాల్లో ప్రదర్శిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను చూసిన చాలా మంది ఎమోషనల్‌గా మారడమే కాకుండా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాను పలువురు సెలబ్రిటీల కోసం కూడా స్పెషల్ స్క్రీనింగ్ వేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ మేజర్ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. తాజాగా ఓ నెటిజన్ మేజర్ చిత్ర హీరో అడివి శేష్‌ను ఓ కోరిక కోరాడు. మేజర్ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయాలని కోరాడు. దీనికి అడివి శేష్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు.

Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..

‘పక్కా’ అంటూ సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమాను పవన్ తప్పక చూడాలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మేజర్ చిత్రం దేశభక్తికి సంబంధించింది కావడంతో ఈ సినిమాను అందరు హీరోల అభిమానులు ఆదరిస్తారని.. ఈ సినిమా విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని, ఆయన ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శశికిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న మేజర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.