Adivi Sesh : కరోనా వచ్చి ఐసోలేషన్ లో ఉన్నా.. నా కోసం మీరు వెళ్లి సినిమాలు చూడండి..

అడివి శేష్.. ''నేడు కల్యాణ్‌రామ్‌ నటించిన ‘బింబిసార’, నా స్నేహితులు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, సుమంత్‌ నటించిన ‘సీతారామం’ సినిమాలు బాగున్నాయి అని బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇది కదా...........

Adivi Sesh : కరోనా వచ్చి ఐసోలేషన్ లో ఉన్నా.. నా కోసం మీరు వెళ్లి సినిమాలు చూడండి..

Adivi Sesh :  చిన్న సినిమాలతో భారీ హిట్స్ కొట్టే అడివి శేష్ ఇటీవలే మేజర్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. త్వరలో హిట్ 2 సినిమాతో రాబోతున్నాడు. తాజాగా అడివిశేష్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నేడు కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు చూడమని చెప్తూ తనకి కరోనా వచ్చిన విషయాన్నీ తెలియచేశాడు అడివిశేష్.

Dilraju in Tirumala : కొడుకుతో తొలిసారి తిరుమలలో దిల్ రాజు, భార్య తేజస్విని

అడివి శేష్.. ”నేడు కల్యాణ్‌రామ్‌ నటించిన ‘బింబిసార’, నా స్నేహితులు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, సుమంత్‌ నటించిన ‘సీతారామం’ సినిమాలు బాగున్నాయి అని బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇది కదా మనకి కావాల్సింది. కరోనా వచ్చి ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం మార్నింగ్‌ షో ఒక సినిమా, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి” అని తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు. దీంతో అడివి శేష్ కి కరోనా వచ్చింది అని తెలియడంతో అభిమానులు జాగ్రత్త, త్వరగా కోలుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు.