Veera Simha Reddy : అఖండ తరువాత బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమా..

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సృష్టించింది.

Veera Simha Reddy : అఖండ తరువాత బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమా..

eera Simha Reddy collections

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. బాలయ్య నుంచి చాలా రోజులు తరువాత ఫ్యాక్షన్ డ్రామా స్టోరీ రావడంతో భారీ ఓపెనింగ్స్ ని సాదించింది. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సృష్టించింది.

Veera Simha Reddy : సినిమా విషయంలో నేనొక సలహా ఇచ్చా.. ఇవాళ అదే హైలైట్ అయ్యింది.. బాలకృష్ణ!

అఖండ సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఇప్పుడు నెక్స్ట్ సినిమాతోనే మరోసారి ఆ క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. మొదటి వీకెండ్ పూర్తి చేసుకునేప్పటికీ వీరసింహారెడ్డి చిత్రం దాదాపు రూ.104 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీనిబట్టి షేర్ రూ.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజులోనే బడ్జెట్ లోని 75 శాతం రాబట్టడంతో చిత్ర నిర్మాతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. దగ్గరలో పెద్ద సినిమా రిలీజ్ లు ఏవి లేకపోవడంతో ఈ మూవీ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ కి ఇవ్వకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేయడంతో.. నిర్మాతలు చాలా వరకు లాభాలు చూసే ఛాన్స్ ఉంది. కాగా ఈ మూవీ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నేటితో ఈ సినిమా అక్కడ 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని సిస్టర్ సెంటిమెంట్ అందర్నీ ఏడిపిస్తుంది. ఈ మూవీలో బాలకృష్ణకి చెల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్ పాత్రలు చేశారు. దునియా విజయ్ విలన్ గా నటించాడు. థమన్ సంగీతం అందించాడు.