Chiru-Balayya : సిమ్రాన్ తరువాత మళ్ళీ ఇప్పుడు శ్రుతిహాసన్.. ఈసారి చిరు, బాలయ్యలో ఎవరు గెలుస్తారో?

ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పందెం జరుగనుంది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి' ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ పందెంలో ఏ కోడి గెలుస్తుందో అని అందరిలో ఆశక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలయిన సాంగ్స్ అండ్ టీజర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేశాయి.

Chiru-Balayya : సిమ్రాన్ తరువాత మళ్ళీ ఇప్పుడు శ్రుతిహాసన్.. ఈసారి చిరు, బాలయ్యలో ఎవరు గెలుస్తారో?

After Simran Its Shruti Haasan

Chiru-Balayya : ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పందెం జరుగనుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ పందెంలో ఏ కోడి గెలుస్తుందో అని అందరిలో ఆశక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలయిన సాంగ్స్ అండ్ టీజర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేశాయి.

Adivi Sesh : చాలా పొగరుగా ప్రవర్తించేవాడు.. దర్శకుడుపై అడివి శేషు ఆరోపణలు..

కాగా ఈ రెండు సినిమాలకు చాలా అంతర్గత సంబంధాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాబీ, వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మలినేని గోపీచంద శిష్యుడు. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అలాగే ఈ రెండు సినిమాలతో అభిమానులు మళ్ళీ తమ వింటేజ్ అభిమాన హీరోని చూడబోతున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కూడా శృతిహాసన్న కావడం గమనార్హం.

అయితే గతంలో ఇలాగే మృగరాజు, నరసింహనాయుడు సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాలు 2001 సంక్రాంతి బరిలో నిలవగా, అప్పుడు బాలయ్య గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు అలాంటి కాంబినేషన్ తోనే సంక్రాంతి పోటీకి వస్తుండడంతో ఈసారి ఎవరు గెలుస్తారు అని ఇప్పటి నుంచే పందాలు వేసుకుంటున్నారు అభిమానులు. మరి ఈ పందెంలో చిరు గెలుస్తాడా? బాలయ్య గెలుస్తాడా? అనేది చూడాలి.