Aishwaryaa Rajinikanth : బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్ మాజీ భార్య

ఐశ్వర్య బాలీవుడ్‌లో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో అధికారిక పోస్ట్ పెట్టింది. ‘ఓ సాథీ చ‌ల్’ అనే టైటిల్ తో ప్రేమ‌క‌థ‌కు ద‌ర్శ‌క‌త్వం వహించబోతుంది........

Aishwaryaa Rajinikanth : బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్ మాజీ భార్య

Ayishwarya

 

Aishwaryaa Rajinikanth :  కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కూడా వీరు స్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల ఐశ్వర్య ఓ ప్రైవేట్ సాంగ్ కి దర్శకత్వం వహించగా ఆ పాట రిలీజ్ రోజున ధనుష్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఇక ఇప్పటికే ఐశ్వర్య తమిళ్ లో డైరెక్టర్ గా రెండు సినిమాలు తీసింది. ఒక డాక్యుమెంటరీ కూడా డైరెక్ట్ చేసింది.

తాజాగా ఐశ్వర్య బాలీవుడ్‌లో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో అధికారిక పోస్ట్ పెట్టింది. ‘ఓ సాథీ చ‌ల్’ అనే టైటిల్ తో ప్రేమ‌క‌థ‌కు ద‌ర్శ‌క‌త్వం వహించబోతుంది ఐశ్వర్య. ఈ సినిమా పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి..”ఇంత‌కంటే గొప్ప‌గా వారాన్ని ప్రారంభించ‌లేను. దర్శకురాలిగా బాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాను. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతుంది” అని తెలిపింది.

Maria Ryaboshapka : శివకార్తికేయన్, జాతిరత్నాలు డైరెక్టర్ సినిమాలో ఉక్రెయిన్ నటి..

ఈ సినిమాని క్లౌడ్9 పిక్చ‌ర్స్ ప‌తాకంపై మీను అరోరా నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు తెలియచేయనున్నారు. విడాకుల అనంతరం ఐశ్వర్య కెరీర్ మీద కొంచెం ఎక్కువే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.