అక్కినేని అఖిల్‌కు షూటింగ్‌లో గాయాలు

  • Published By: vamsi ,Published On : March 6, 2020 / 02:53 AM IST
అక్కినేని అఖిల్‌కు షూటింగ్‌లో గాయాలు

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్ గాయ‌ప‌డ్డాడ‌ట‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఫైటింగ్ సీన్ జరుగుతుండగా.. జరిగిన ప్ర‌మాదంలో అఖిల్ కుడి చేతికి గాయం అవ్వగా.. డాక్టర్లు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం అఖిల్ రెస్ట్ తీసుకుంటున్నాడు.

వారం రోజుల తర్వాత అంటే.. మార్చ్ 12వ తేదీ నుంచి మళ్లీ అఖిల్ రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. గీత గోవిందం ఫేమ్ గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్న అఖిల్‌కు ఈ సినిమా విజయం తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా కోసం అఖిల్ గట్టిగా కష్టపడుతున్నాడట. 

జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన తొలి పాట మనసా.. మనసా శ్రోతలను ఆకట్టుకుంటుంది. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు.  

See Also | కరోనా కట్టడి : ముఖాన్ని పదే పదే తాకొద్దు