అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో భారీ సినిమా
యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టోరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్, సురేందర్ ల క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రం లో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్.. బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో అఖిల్ తన 4వ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి పూజా హెగ్డే లక్ కూడా కలిసి వస్తుందని, సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది చిత్ర టీమ్.
It’s time ! Announcing my next with @DirSurender and @AnilSunkara1. This one is extremely special to me ??. Fully pumped to start soon. Energy all the way ?? @AKentsOfficial @S2C_Offl #Akhil5 pic.twitter.com/fCF25tR3qJ
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 9, 2020