అఖిల్ 4 ఫిక్సయ్యిందా?
బొమ్మరిల్లు భాస్కర్తో అఖిల్ సిినిమా..
బొమ్మరిల్లు భాస్కర్తో అఖిల్ సిినిమా..
అక్కినేని థర్డ్ జెనరేషన్ హీరోగా అఖిల్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.. ఆ సినిమా రిజల్ట్ సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత హలో కూడా నిరాశ పరిచింది. మూడవ సినిమా Mr.మజ్ను పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇప్పుడు అఖిల్ నాలుగవ సినిమాకి రంగం సిద్ధమైంది. బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, ఆరెంజ్, ఒంగోలుగిత్త వంటి డిజాస్టర్స్తో టాలీవుడ్కి దూరమైన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు.
అరవింద్ ప్రాజెక్ట్ ఓకే చేసాడంటే కథలో విషయం ఉంటుంది. ఇక కమర్షియల్గా ఎలా హిట్ చెయ్యాలి, ఏంటి అనే లెక్కలు ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలియవనుకోండి అదివేరే విషయం.. ఈ సినిమాలో అఖిల్ సరసన కైరా అద్వాణీ కథానాయికగా నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.