స్వీట్ సెల్ఫీ : ‘మన్మథుడు 2’ ఫ్యామిలీ ఇదే
అక్కినేని నాగార్జున, అన్షు, సోనాలిబింద్రే నటించిన మన్మథుడు సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మన్మథుడు -2తో రాబోతున్నాడు నాగ్. ఈ సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. షూటింగ్ స్పీడ్ గా జరుగుతంది. ఈ క్రమంలోనే సోమవారం (ఏప్రిల్ 1, 2019)న ఈ మూవీలో నటించే టీమ్ అంతా కలిసి ఓ గ్రూప్ సెల్ఫీ దిగారు. ఈ పిక్ ను యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇదే మన్మథుడు -2 టీమ్ అని ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో నాగ్, రకుల్ జంట చక్కగా కనిపించింది.
‘‘నేను, నా మన్మథుడు 2 ఫ్యామిలీ.. సంతోషంగా ఉంది’’ అంటూ నాగ్ షేర్ చేసిన పిక్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రావు రమేష్, వెన్నెల కిషోర్, లక్ష్మీ మొదలగువారంతా ఉన్నారు. సీనియర్ నటి లక్ష్మి చాలా కాలం తరవాత ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నారు.
అంతేకాదు ‘మన్మథుడు’ సినిమాలో బ్రహ్మానందం పోషించిన లవంగం పాత్ర థియేటర్లో నవ్వులు పువ్వులు పూయించింది. ఇప్పుడు ఇలాంటి పాత్రనే ‘మన్మథుడు 2’లో వెన్నెల కిషోర్ పోషిస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందట.
Me and my #Manmadhudu2 family!!! Loving it!!❤️ pic.twitter.com/cprBDr2mVi
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2019