బంటూ తీసిన ‘అర్జున్ రెడ్డి పార్ట్ -2’ షార్ట్ ఫిల్మ్ చూశారా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘అల వైకుంఠపురములో’ డిలీటెడ్ సీన్..

  • Published By: sekhar ,Published On : March 16, 2020 / 01:55 PM IST
బంటూ తీసిన ‘అర్జున్ రెడ్డి పార్ట్ -2’ షార్ట్ ఫిల్మ్ చూశారా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘అల వైకుంఠపురములో’ డిలీటెడ్ సీన్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..‘అల వైకుంఠపురములో’.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది.

నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్, సునీల్, నవదీప్ తదితరులు నటించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు విడుదల చేసిన వీడియో సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ..‘అల వైకుంఠపురములో’ నుంచి ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

రాజు (సుశాంత్) డ్రింక్, స్మోక్ చేస్తున్నప్పుడు బంటి (అల్లు అర్జున్) వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ఈ వీడియోలో చూపించారు. డిలీటెడ్ సీన్ అయినా కామెడీగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసెయ్యండి మరి..