అల వైకుంఠ పురంలో : యూసుఫ్ గూడలో బన్నీ ఫ్యాన్స్ సందడి
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం వినూత్నంగా జరుపుతోంది. అందులో భాగంగా 2020, జనవరి 06వ తేదీ సోమవారం సాయంత్రం Musical Concert నిర్వహిస్తోంది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక..ఇతర రాష్ట్రాల నుంచి బన్నీ ఫ్యాన్స్ యూసుఫ్ గూడకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడి సందడి నెలకొంది. ఎలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వెళ్లే ప్రతొక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక స్టేడియంలో లోపల భారీ ఏర్పాట్లు చేశారు చిత్ర యూనిట్. స్టేజీపై 70 మంది కూర్చొనే విధంగా నిర్మాణం చేశారు. 58 ఇంచులు కలిగిన స్ర్కీన్ ఏర్పాటు చేశారు.
గ్రౌండ్స్ లిమిట్ మాత్రం 10 వేల మంది మాత్రమేనంట. కానీ అంతకు ఎక్కువగానే బన్నీ ఫ్యాన్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వస్తే..పోలీస్ గ్రౌండ్ కిక్కిరిపోయే ఛాన్స్ ఉంది.
మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభంగా విడుదల చేసిన చిన్నపాటి టీజర్లో గ్యాప్ తీసుకొలే..వచ్చింది..అంటూ బన్నీ చెప్పిన డైలాగ్తో ఫ్యాన్స్ సంబర పడిపోయారు. సినిమాకు సంబంధించిన ఫొటోలు, ఇతరత్రా విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఒక్కో సాంగ్ను యూ ట్యూబ్లో విడుదల చేశారు. దీనికి భారీగా రెస్పాండ్ వచ్చింది. ప్రధానంగా రాములో రాముల సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఓ సాంగ్లో బన్నీ వేసిన దోశ స్టెప్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. జనవరి 11న విడుదలైన అనంతరం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.
Read More : వాళ్లే చూసుకుంటారు : మా అసోసియేషన్ వివాదాలపై చెర్రీ స్పందన