అల వైకుంఠపురములో.. ఓవర్సీస్ రైట్స్ సోల్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల... వైకుంఠపురములో’... ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల… వైకుంఠపురములో’… ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల… వైకుంఠపురములో’… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్పై.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘సామజవరగమన’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది.
‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ రైట్స్ను బ్లూ స్కై సినిమాస్ దక్కించుకుంది. రూ. 8.56 కోట్లకు ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ హక్కులు అమ్ముడవడం విశేషం.. త్రివిక్రమ్, బన్నీ సినిమాలకు ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉండడం, ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వీరి కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ పక్కా అనే నమ్మకంతో భారీ ధరకు ఓవర్సీస్ హక్కులు కొన్నారు.
Red Also : సైరా విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్కాగా, టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 సంక్రాంతికి ‘అల… వైకుంఠపురములో’… రిలీజ్ కానుంది.
కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.