‘సామజవరగమన – నినుచూసి ఆగగలనా’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'అల... వైకుంఠపురములో'... నుండి 'సామజవరగమన.. నినుచూసి ఆగగలనా'.. సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 04:57 AM IST
‘సామజవరగమన – నినుచూసి ఆగగలనా’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’… నుండి ‘సామజవరగమన.. నినుచూసి ఆగగలనా’.. సాంగ్ రిలీజ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘అల… వైకుంఠపురములో’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘సామజవరగమన.. నినుచూసి ఆగగలనా’.. అనే పాటకు థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. యంగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడు.

‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. సామజవరగమన.. నినుచూసి ఆగగలనా… మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా’.. అంటూ సాగే మెలోడీ సాంగ్ వినసొంపుగా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా.. వయొలిన్, పియానో, గిటార్, డ్రమ్స్, బేస్ గిటార్ వంటి వాయిద్యాలతో .. 70 మంది ఆర్కెస్ట్రా, 35 పీస్ బ్యాండ్‌తో ఈ సాంగ్ కంపోజ్ చేశారు..

Read Also : ఆవిరి – టీజర్ 1..

పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్‌కాగా, టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల… వైకుంఠపురములో’… రిలీజ్ కానుందని తెలుస్తుంది. కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.