పెళ్లికి బాజా మోగింది.. ధూం! ధాం! గా బారాత్
అలియా భట్, రణబీర్ల పెళ్లికి డిసెంబర్లో ముహూర్తం ఫిక్స్..
అలియా భట్, రణబీర్ల పెళ్లికి డిసెంబర్లో ముహూర్తం ఫిక్స్..
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ తర్వాత బాలీవుడ్లో జరగబోయే క్రేజీయెస్ట్ వెడ్డింగ్ అలియా భట్, రణబీర్ కపూర్లది. గతకొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ.. డేటింగ్లో ఇష్టాఇష్టాలు షేర్ చేసుకుంటూ.. ఎక్కడ చూసినా కలిసికట్టుగా కెమెరా కళ్లు కుళ్లుకునేలా కనిపించిన ఈ జంటకు దిష్టితగలడంతో కొద్ది రోజుల క్రితం వీరి ప్యార్ బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి.
ఒకరి బర్త్డే పార్టీలో మరొకరు కనిపించక పోవడంతో ఈ వార్తలు నిజమేనని నమ్మేసారు నెటిజన్లు. కట్ చేస్తే.. అదంతా తూచ్ అని.. వీరి బంధం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్, ఇప్పటికీ రిలేషన్లోనే ఉన్నారని బాలీవుడ్ సమాచారం. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి సంబంధించిన పనుల గురించి డిస్కస్ చేయడం కూడా జరిగిపోయిందట.
Read Also : నువ్వు వర్జిన్వేనా? నెటిజన్ ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్
ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ముంబైలో ఓ 10 రోజుల పాటు బ్యాండ్ బాజా బారాత్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. రిషి కపూర్ ఆరోగ్యం మెరుగుపడడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ 21వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలియా, రణబీర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.