Allu Arha: సమంతా ‘శాకుంతలం’తో అల్లు అర్హ ఎంట్రీ ఖరారు!

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి చేసే అల్లరి వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తే అభిమానులు తెగ మురిసిపోతుంటారు. కాగా, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి మరో నటి రాబోతుంది.

Allu Arha: సమంతా ‘శాకుంతలం’తో అల్లు అర్హ ఎంట్రీ ఖరారు!

Allu Arha

Allu Arha: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి చేసే అల్లరి వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తే అభిమానులు తెగ మురిసిపోతుంటారు. కాగా, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి మరో నటి రాబోతుంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టీ అర్హ.

ఇప్పటి వరకు తన క్యూట్ మాటలతో అభిమానులకు ఆకట్టుకున్న అర్హను త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అర్హను వెండితెరమీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడని.. నూతన దర్శకుడు సురేష్ పూర్తిగా పిల్లల కాన్సెప్ట్ తో సాగే సినిమాతో అర్హ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ.. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అర్హ ఎంట్రీ ఖరారైంది.

గుణశేఖర్ ఇటీవల శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ ఓ కీలకపాత్రలో నటించనుందని సినిమా యూనిట్ ప్రకటించింది. అల్లు అర్హ ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. అర్హ గురువారం సెట్స్‌లో చేరగా మొత్తం 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుందట.

ఈ సినిమా మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుండగా మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న దేవ్ మోహన్ తో పాటు భారీ తారాగణం ఈ సినిమాలో భాగంకానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిచనున్నారు.