అల్లూ అర్జున్ కుటుంబంలో విషాదం

  • Published By: vamsi ,Published On : January 23, 2020 / 03:35 AM IST
అల్లూ అర్జున్ కుటుంబంలో విషాదం

అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకుని జోరు మీద ఉన్న అల్లూ అర్జున్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం పాలయ్యాడు. అల్లు ఫ్యామిలీకి ఇది షాకింగ్ న్యూస్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు కూడా మేనమామ ముత్తంశెట్టి ప్రసాదే నిర్మాతగా ఉన్నారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ముత్తంశెట్టి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న బన్నీకి మేనమామ మరణం అనుకోని షాక్ ఇచ్చింది. గుండెపోటుతో చనిపోయిన ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. చిన్నప్పటి నుంచి కూడా మేనమామతో సన్నిహితంగా ఉండేవాడు బన్నీ.

విజయవాడలో ఆయన కన్నుమూసారు. ఈ విషయం తెలియగానే అల్లు కుటుంబం అంతా అక్కడికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోని పలువురు కూడా ఈయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.