తన సినిమా అప్పుడు విడుదలైతే బాహుబలి – 2 రికార్డ్స్ బ్రేక్ చేసేది – బిగ్ బి

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 05:10 AM IST
తన సినిమా అప్పుడు విడుదలైతే బాహుబలి – 2 రికార్డ్స్ బ్రేక్ చేసేది – బిగ్ బి

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అందులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి మూవీ ఒకటి. అప్పట్లో బాక్సాఫీసు దగ్గర రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా 2017లో విడుదలైతే బాహుబలి – 2 రికార్డులను కూడా వెనక్కి నెట్టేదని అమితాబ్ అన్నారు. 1977లో రిలీజ్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రీసెంట్ గా 43 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అమితాబ్. మెగాస్టార్ వారసులైన శ్వేత, అభిషేక్ ఈ మూవీ షూటింగ్ సెట్‌ కి వచ్చారు. వారిద్దరితో బిగ్ బి  దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అమితాబ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ రాశారు.శ్వేత, అభిషేక్ అమర్ అక్బర్ ఆంటోని సెట్‌కు వచ్చారు. ఆ సమయంలో మై నేమ్ ఈజ్ ఆంటోని పాట షూటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఫోటో బీచ్‌ ముందు దిగాము అంటూ అప్పటి జ్ఞాపకాలు నెట్టింట్లో పంచుకున్నారు అమితాబ్. 

అప్పట్లోనే 7.25 కోట్లు వసూలు చేసింది. లెక్క ప్రకారం ప్రకారం ఇప్పుడు ఈ టైమ్ లో బాహుబలి – 2 హిందీ వసూళ్లకంటే ఎక్కువనే చెప్పాలి. 1977 మే 27న విడులైన అమర్ అక్బర్ ఆంటోని మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేసింది. దాదాపు 25 వారాల పాటు ముంబైలోని 25 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అన్నదమ్ములైన ముగ్గురి పాత్రల్లో వినోద్ ఖన్నా, రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్ నటించారు.

ఈ ముగ్గురు కొన్ని కారణాల వల్ల చిన్నతనంలోనే విడిపోవడం. మళ్లీ కలుసుని శత్రువుపై ఏ విధంగా పగ తీర్చుకున్నారన్నదే కథ. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైమ్ లో యావరేజ్ టిక్కెట్ రేటు రెండు రూపాయలు. అప్పట్లో ఈ సినిమాను 3,62,50,000 మంది చూశారు. 2017లో బాహుబలి-2 విడుదలైన సమయంలో టిక్కెట్ 150. ఈ రేటు ప్రకారం లెక్కవేస్తే  అమితాబ్ మూవీ ఇపుడు రిలీజ్ అయితే రూ. 543 కోట్లు వసూలు చేసేదని అంచనా.

 

Read:  తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌