అమితాబ్ తో గొడవ…ఇన్నేళ్ల తర్వాత అమర్ సింగ్ పశ్చాత్తాపం
బిగ్ బీ అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల తాను చేసిన ఓవరాక్షన్ కు పశ్చాత్తాపపడుతున్నానని సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం(ఫిబ్రవరి-18,2020)ఓ ట్వీట్ చేశారు.
ఈ రోజు మా నాన్న గారి వర్థంతి. అమితాబ్ బచ్చన్ గారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. జీవితం,చావుతో నేను పారాడుతున్న ఈ స్టేజీలో అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల చేసిన ఓవరాక్షన్ పట్ల పశ్చాత్తాప్పడుతున్నాను. దేవుడు వారందరినీ చల్లగా చూడాలి అంటూ అమర్ సింగ్ ట్వీట్ లో తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తాను జీవితం,చావుతో పోరాటం చేస్తున్నానని అమర్ సింగ్ తెలిపారు.
కొన్నేళ్ల క్రితం వరకు అమర్ సింగ్,అమిత్ బాబ్ బచ్చన్ మంచి మిత్రులే. అయితే గొడవల కారణంగా వీరి మధ్య స్నేహ బంధాలు తెగిపోయాయి. అమితాబ్ బచ్చనే తనతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకున్నాడని సింగ్ తెలిపారు. జయాబచ్చన్,అమితాబ్ బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారని కొన్నేళ్ల క్రితం అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
2017లో ఓ ఇంటర్వ్యూలో సింగ్ మాట్లాడుతూ…తాను అమితాబ్ బచ్చన్ ను కలవడానికి ముందే అమితాబ్,ఆయన భార్య జయా బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారని,ఒకరు ప్రతీక్షాలో నివాసముంటుండగా,మరొకరు తన వేరొక బంగ్లా జనక్ లో ఉంటుండేవారని తెలిపారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయ బచ్చన్ ల మధ్య సమస్యల గురించి కూడా ఊహాగానాలు వచ్చాయని దానికి తాను బాధ్యుడిని కాదని సింగ్ అన్నారు. అంతేకాకుండా జయాబచ్చన్ యొక్క సమాజ్ వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించవద్దని అమితాబ్ బచ్చన్ గతంలో తనను హెచ్చరించాని కూడా అమర్ సింగ్ తెలిపారు. అయితే అమర్ సింగ్ వ్యాఖ్యలను అమితాబ్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అతడు ఫ్రెండ్ అని,ఏది చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పేందుకు అతనికి హక్కు ఉందని బిగ్ బీ అన్నారు.
2017లో పనామా పేపర్స్ లీక్ లో అమితాబ్ బచ్చన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ…పనామా కేసులో అమితాబ్ బచ్చన్ నుండి కొంత నిశ్శబ్దం ఉంది. ఇది ఖల్నాయక్ సినిమాలోని నాయక్ లుక్ లా కనిపిస్తుంది. ఓ అభిమానిగా, తన హీరో అమితాబ్ క్లీన్ గా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగ్ తెలిపారు. 1990ల్లో అమితాబ్ బచ్చన్ కు చెందిన ప్రొడక్షన్ ఏబీసీఎల్ కుప్పకూలిపోయినప్పుడు అమితాబ్ ఫైనాన్స్ మరో మలుపు తీసుకున్న సమయంలో అమర్ సింగ్ బచ్చన్ కు సహాయం చేసినట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఏదేమైనా, అమర్ సింగ్ జైలులో ఉన్నప్పుడు వారి స్నేహం దెబ్బతింది.
2008నాటి క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ లో 2011లో అమర్ సింగ్ కు బెయిల్ వచ్చింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై వచ్చిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు. అమర్ సింగ్ ఎయిమ్స్ లో ఉన్న సమయంలో ఆయనను చేసేందుకు బచ్చన్ వెళ్లారు. అయితే కేవలం తాను బెయిల్ పై బయటికొచ్చి హాస్పిటల్ లో చేరిన తర్వాతనే తనను చేసేందుకు అమితాబ్ బచ్చన్ వచ్చారని, అమితాబ్ రాకతో తాను ఇంప్రెస్ అవ్వలేదని,తాను జైలులో ఉండగా అతను రాలేదని సింగ్ అన్నారు. అతను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను అతనితో మాట్లాడాలని అనుకోలేదు. ఎందుకంటే అతని పట్ల నాకు ఉన్న భావాలు, స్నేహం పోయింది. అవి నా మనస్సు నుండి ఫిల్టర్ అయ్యాయి. ఎక్కువగా ప్రజలు వెదర్ కాక్స్(గాలిపడగ)అని గ్రహించాను అని సింగ్ తెలిపారు.
అమితాబ్ రాజకీయంగా కరెక్ట్,సున్నితమైన వ్యక్తి. సుబ్రతా రాయ్ కూడా అదే. నేను అతనిని రెండుసార్లు తీహార్ జైలులో చూడటానికి వెళ్ళాను. ప్రజలు నాకు ఏమి చేశారో నేను కూడా వారికి తప్పక చేస్తాను అని చెప్పాను. అతను రావడానికి చాలా సమయం పట్టిందని అమర్ సింగ్ చెప్పినట్లు సునేత్రా చౌదరి రాసిన ఇండియాస్ మోస్ట్ ఫేమస్ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత గతం గతహా అని సింగ్ ఆలోచించినట్లు ఇవాళ అమితాబ్ బచ్చన్ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయడాన్ని బట్టి తెలుస్తోంది.
Today is my father’s death anniversary & I got a message for the same from @SrBachchan ji. At this stage of life when I am fighting a battle of life & death I regret for my over reaction against Amit ji & family. God bless them all.
— Amar Singh (@AmarSinghTweets) February 18, 2020