Amitabh Bachchan : ప్రాజెక్ట్-K షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కి ప్రమాదం..

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్-K'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా పాల్గొన్నారు. మూవీలోని కీలకమైన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అమితాబ్ బచ్చన్ స్వల్పంగా గాయపడ్డారట.

Amitabh Bachchan : ప్రాజెక్ట్-K షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కి ప్రమాదం..

Amitabh Bachchan is injured at project k sets during action sequence shooting

Amitabh Bachchan : ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్-K’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివారులో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలోని అమితాబ్ పాత్ర చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చింది అంటూ ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీలోని కీలకమైన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అమితాబ్ బచ్చన్ స్వల్పంగా గాయపడ్డారట.

Project K : ప్రాజెక్ట్-K లో దుల్కర్ సల్మాన్.. నిజమేనా?

దీంతో అమితాబ్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పక్కటెముక కండరాలకు గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అమితాబ్ బచ్చన్ ముంబైలోని తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే అమితాబ్ ప్రతి శనివారం తన నివాసం వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం గాయం బాధిస్తుండం, శ్వాస తీసుకోవడం కూడా అమితాబ్ కి ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్నివారాల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఈ వారం తన నివాసం వద్దకు ఎవరూ రావద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు అమితాబ్.

అత్యంత ముఖ్యమైన పనులకు తాను ఫోన్ లో అందుబాటులో ఉంటానని, తన విశ్రాంతికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని అమితాబ్ బచ్చన్ కోరారు. అలాగే షూటింగ్ లో గాయం అవ్వడంతో ప్రస్తుతానికి ప్రాజెక్ట్-K షూటింగ్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిలిపివేసినట్లు కూడా అమితాబ్ తెలియజేశారు. ఇక ఈ వార్త తెలియడంతో బిగ్ బి అభిమానులు అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

కాగా ఈ ప్రాజెక్ట్-K లో బాలీవుడ్ భామలు దీపికా పడుకోణె, దిశా పటాని నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రం మోడరన్ విష్ణుమూర్తి కథాంశంతో ఉండబోతుంది అంటూ ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ తెలియజేశాడు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమానివచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.