ప్రభాస్ సినిమా గురించి అమితాబ్ ఏమన్నారంటే!

  • Published By: sekhar ,Published On : October 9, 2020 / 05:29 PM IST
ప్రభాస్ సినిమా గురించి అమితాబ్ ఏమన్నారంటే!

Amitabh Bachchan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ కలయికలో అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తోంది. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్‌ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది.


బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం’ అంటూ వీడియోతో పాటు ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన అమితాబ్ ఈ సినిమా గురించి స్పందించారు.


‘ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’.. అంటూ కామెంట్ చేశారు. అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల అమితాబ్ బచ్చన్ సార్‌తో తెరపంచుకోబోతున్నాను.. కల నిజమైంది అంటూ డార్లింగ్ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశాడు.