గుర్రం రేసుల్లో ఆస్తి మొత్తం పోయింది- అనసూయ

గుర్రం రేసుల్లో ఆస్తి మొత్తం పోయింది- అనసూయ

Anasuya Baradwaj Unscrupulous Comments On The Father

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టాప్‌ యాంకర్స్‌లో ఒకరిగా వెలుగొంతూనే సినిమాల్లో రాణిస్తోంది అనసూయ భరద్వాజ్‌. బుల్లితెరపై.. వెండితెరపై సత్తా చాటుకుంటూ.. ప్రధాన పాత్రల్లో సైతం నటిస్తోన్న ఈ భామ.. స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో చేస్తుంది. ప్రేక్షకుల మనసులను దోచుకుంటోన్న రంగమ్మత్త.. తమిళం, మలయాళంలో కూడా బిజీగా మారిపోయి సినిమాలు చేస్తుంది.

లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన కుటుంబం గురించి, ఫ్యామిలీ పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాల్యంలో అనుభవించిన కష్టాలను.. తన చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని గురించి వివరించింది. చిన్నప్పుడు రిచ్‌గానే పెరిగామని, ఇంతవరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని అనసూయ చెప్పుకొచ్చింది.

తమకు గుర్రాలు ఉండేవని, తండ్రికి గుర్రపు రేసులు, గ్యాంబ్లింగ్‌(జూదం) అంటే పిచ్చియని, వాటి పిచ్చిలోనే తమ ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేశారని వెల్లడించింది.తన తండ్రి గుర్రపు రేసుల్లో ఆస్తులు మొత్తం పోగొట్టాడని తెలిపింది. అయితే, తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి చెప్పేవారని, ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నాం? అనేది కూడా దూరం నుంచి కనిపెడుతుండేవారని అనసూయ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆహాలో అనసూయ నటించిన ‘థాంక్‌ యూ బ్రదర్‌’ సినిమా ప్రసారం అవుతుంది. టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌లో కలిపి సుమారు 6 ప్రాజెక్టులతో అనసూయ బిజీగా ఉన్నారు.