Anasuya Bharadwaj: సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్కు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చేసే టీవీ షోలు, సినిమాలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయకు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ, కొందరు మాత్రం అనసూయను ఆన్లైన్లో టార్గెట్ చేస్తూ ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్కు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చేసే టీవీ షోలు, సినిమాలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయకు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ, కొందరు మాత్రం అనసూయను ఆన్లైన్లో టార్గెట్ చేస్తూ ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ఇటీవల ఓ యంగ్ హీరో నటించిన సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ ఓ ట్వీట్ చేసింది. అది కాస్త ఆ హీరో అభిమానులకు చురకులుగా అనిపించడంతో వారు అనసూయను సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అంటూ ట్రెండింగ్ చేశారు. దీనిపై అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా అందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తనను, తన కుటుంబాన్ని కించపరిచే విధంగా కామెంట్స్ చేస్తే, తాను ఏం చేయాలో అది చేస్తానంటూ హెచ్చరించింది. అయినా కూడా అనసూయను నెట్టింట ఓ రేంజ్లో ఆడుకున్నారు.
Anchor Anasuya : ట్రెండింగ్లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..
దీంతో అనసూయ ఆగ్రహానికి గురై, తనపై ఆన్లైన్ అబ్యూస్కు పాల్పడిన వారికి సంబంధించిన స్క్రీన్షాట్స్ తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక మహిళ పట్ల ఇలా సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా ప్రవర్తించే వారికి సైబర్ క్రైమ్ వారు తగిన బుద్ధి చెప్పాలంటూ అనసూయ కోరుతోంది. మరి ఈ వివాదం ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
#SayNoToOnlineAbuse #StopAgeShaming #StopCyberBullying
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 29, 2022