కొడుకు మాటలు కన్నీరు తెప్పించాయంటోన్న అనసూయ

కొడుకు మాటలు కన్నీరు తెప్పించాయంటోన్న అనసూయ

కొడుకు మాటలు విని భావోద్వేగానికి గురయ్యారు యాంకర్ Anasuya. కరోనా వైరస్‌, పలు ప్రకృతి విపత్తులు అన్నీ కలిసి ఈ ఏడాది కఠిన పరిస్థితులు ఎదుర్కొనేలా చేశాయి. కొందరి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతిఒక్కరూ గడిచిన రోజులను గుర్తుచేసుకుంటూ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అనసూయ కొడుకు కూడా అలాగే కోరుకుంటుంటే ఆ తల్లి మనసు చెమర్చిందట. కొడుకు మాటలను గుర్తు చేసుకుంటూ.. తాజాగా ఆమె ట్వీట్‌ చేశారు.

‘అమ్మా.. నేను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు.. వరదల్లేవు.. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని అందించిన రోజులు’ అని నా 9ఏళ్ల కొడుకు అడిగాడు. అవి నాకెంతో బాధగా అనిపించి కన్నీరు పెట్టుకున్నాను. ఎలాంటి పరిస్థితులు కొనితెచ్చుకున్నాం? రాబోయే తరాల వారికి మనం ఏం అందించగలుగుతున్నాం?’ అంటూ అనసూయ విచారం వ్యక్తం చేశారు.

పేరులోనే కాదు మనసులోనూ భర్తను గుర్తు చేసుకుంటూనే ఉంటారు అనసూయ భరద్వాజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ కపుల్‌ ముద్దుల సంతానం అయాన్ష్‌, శౌర్య. ఫ్యామిలీతో పాటు గడిపిన క్షణాలను తరచూ సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటారు అనసూయ. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో సైతం షూటింగ్స్‌ నుంచి విరామం దొరకడంతో ఆమె.. ఇద్దరు కొడుకులతో ఇంట్లోని పెంపుడు జంతువులతో గడిపారు.