Anushka Sharma : ఇకపై సంవత్సరానికి ఒక సినిమానే చేస్తా.. వాళ్ళ కోసమే ఈ నిర్ణయం..

అనుష్క శర్మ త్వరలో చెక్ దే ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో రాబోతుంది. టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేయట్లేదని అనుష్క ఫ్యాన్స్ బాధపడుతుంటే తాజాగా అనుష్క శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anushka Sharma : ఇకపై సంవత్సరానికి ఒక సినిమానే చేస్తా.. వాళ్ళ కోసమే ఈ నిర్ణయం..

Anushka Sharma comments on Movies goes viral fans disappointed

Anushka Sharma Movies :   బాలీవుడ్ భామ అనుష్క శర్మ ‘రబ్ నే బనాది జోడి’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయింది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది. పెళ్లి తర్వాత అనుష్క నుంచి రిలీజ్ అయిన సినిమాలు నాలుగే. అయితే ఇవన్నీ పెళ్ళికి ముందే షూట్ చేసినవి. పెళ్లి తర్వాత నుంచి అనుష్క ఒక్క సినిమా కుడా చేయలేదు. ఒక సినిమాలో మాత్రం గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది.

రెండేళ్ల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది అనుష్క. అప్పట్నుంచి ఫ్యామిలీతో మరింత ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అనుష్క శర్మ త్వరలో చెక్ దే ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో రాబోతుంది. టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేయట్లేదని అనుష్క ఫ్యాన్స్ బాధపడుతుంటే తాజాగా అనుష్క శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramaprabha : శరత్ బాబు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రమాప్రభ.. వాళ్లందరికీ ఇండైరెక్ట్ గా కౌంటర్లు..

తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ.. నా కూతురు వామికకు ఇది చాలా కీలకమైన సమయం. తనను దగ్గరుండి చూసుకోవాలి. విరాట్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. కానీ తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అందుకే వామిక, విరాట్ కోసం, నా కుటుంబం కోసం సమయం ఇవ్వడానికి నేను ఇకపై సంవత్సరానికి ఒకటే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం అభిమానులకు బాధ కలిగిస్తుందని తెలుసు. కానీ నా కుటుంబం కోసం నేను సమయాన్ని ఇవ్వాలి. నటిగా, భార్యగా, తల్లిగా, ఓ సెలబ్రిటీగా ప్రతి పాత్రను ఆస్వాదించాను. ప్రస్తుతానికి తల్లి పాత్రలో సంతృప్తిగా ఉన్నాను అని తెలిపింది. దీంతో అనుష్క చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అనుష్క నిర్ణయంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.