మూడు, నాలుగు నెలలకోసారి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన అనుష్క శెట్టి..
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన అనుష్క శెట్టి..
టాలీవుడ్లో ‘సూపర్’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసి ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిన అనుష్క శెట్టి… సినీ ప్రస్థానంలో తాజాగా 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
విజయవంతంగా 15 సంవత్సరాలు కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది అనుష్క.. ఈ సంవత్సరమే అనుష్క పెళ్లి పీటలెక్కబోతోందని, ఆమె వివాహం ఎవరో క్రికెటర్తో అని, ఓ దర్శకుడి కుమారుడితో అని రకరకాల వార్తల వినిపిస్తున్న నేపథ్యంలో.. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క స్పందిస్తూ..
‘‘అవును.. నాకు పెళ్లి అంటున్నారు. నాక్కూడా తెలియదు.. ప్రేమ, పెళ్లి అనేవి ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఒకవేళ నేను ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉంటే దాన్ని సీక్రెట్గా దాచాల్సిన అవసరం లేదు. పదేళ్ల నుంచి ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు. నేను న్యూస్ చూడను, పేపర్ చదవను. బయట ప్రపంచాన్ని ఫాలో అవ్వను. నా పని పూర్తయ్యాక కటాఫ్ అయిపోతాను. నీ గురించి ఇలాంటి ఒక వార్త వచ్చిందని నాకు ఎవరో చెబుతారు.
క్రికెటర్ని పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తను దర్శకుడు హేమంత్ (నిశ్శబ్దం) చెప్పారు. అప్పుడెలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఒకరి పర్శనల్ విషయాల గురించి ఉన్నవీ లేనివీ కల్పించి ఎందుకు రాస్తారో తెలియదు. రాసేవాళ్లకూ ఫ్యామిలీ ఉంటుంది కదా. వాళ్ల గురించి అలా రాస్తే వాళ్లు ఫీల్ అవ్వరా?’’ అని సమాధానమిచ్చారు. అనుష్క, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయబోయే షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.