అయోధ్యపై కంగనా ‘‘అపరాజిత అయోధ్య’’ సినిమా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిర్మాతగా మారి ‘రామ జన్మభూమి’ ఉదంతం ఆధారంగా ‘అపరాజిత అయోధ్య’ అనే సినిమా తెరకెక్కించనున్నారు..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిర్మాతగా మారి ‘రామ జన్మభూమి’ ఉదంతం ఆధారంగా ‘అపరాజిత అయోధ్య’ అనే సినిమా తెరకెక్కించనున్నారు..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ‘తలైవి’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంగనా నిర్మతగా చేయనున్న సినిమా గురించి బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్జ జరుగుతోంది. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా ‘మణికర్ణిక’ పేరుతో కంగనా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, త్వరలోనే కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.
‘రామ జన్మభూమి’ ఉదంతం ఆధారంగా నిర్మించనున్న ఈ సినిమాకు ‘అపరాజిత అయోధ్య’ అనే పేరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ తయారు చేస్తున్నారు.
రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదం, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నదని, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు రంగోలీ తెలిపింది. ‘‘తలైవి’’ 2020 జూన్ 26న విడుదల కానుంది.
Very soon Kangana will have a grand launch of Aparajitha Ayodhya where they will announce the director and the cast #workinprogress #newbeginnings ??
— Rangoli Chandel (@Rangoli_A) November 25, 2019