బాధితుడిలా కాదు.. రిపోర్టర్‌లా ఆలోచించాలి : ‘అర్జున్ సురవరం’ ట్రైలర్

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘అర్జున్ సురవరం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : November 19, 2019 / 12:22 PM IST
బాధితుడిలా కాదు.. రిపోర్టర్‌లా ఆలోచించాలి : ‘అర్జున్ సురవరం’ ట్రైలర్

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘అర్జున్ సురవరం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా.. ‘అర్జున్ సురవరం’.. ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడింది.. కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొంది నిఖిల్ సినిమా.. ఎట్టకేలకు ‘అర్జున్ సురవరం’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

కొద్ది రోజులుగా ప్రమోషన్స్ చేపడుతున్న మూవీ టీమ్ మంగళవారం ‘అర్జున్ సురవరం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నకుర్రాడు అనుకోకుండా ఓ పెద్ద స్కామ్‌లో ఇరక్కోవడం, ఫ్యామిలీ, లవర్, సమాజం దృష్టిలో నేరగాడిగా ముద్ర పడడం, తన ఇన్వెస్టిగేషన్‌లో విద్యావ్యవస్థకి సంబంధించిన పెద్ద స్కామ్, దాని వెనకున్న పెద్ద మనిషి ఎవరో తెలియడం, ప్రాణాలకు తెగించి ఆ సమస్యనుండి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కథ అని ట్రైలర్‌ని అర్థమవుతుంది.

Read Also : సరిలేరు నీకెవ్వరు – టీజర్ అప్‌డేట్

నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.. పోసాని, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : శ్యామ్ సిఎస్, కెమెరా : సూర్య, ఎడిటింగ్ : నవీన్ నూలి, సమర్పణ : బి మధు, నిర్మాత : రాజ్ కుమార్ ఆకెళ్ల.