Sai Kiran : మోసం చేశారంటూ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు..

ఒకప్పుడు సినిమాల్లో నటించి 'నువ్వే కావాలి' లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సాయి కిరణ్‌ ఇప్పుడు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంటూ వెండితెర, ఇటు బుల్లితెర...........

Sai Kiran : మోసం చేశారంటూ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు..

Sai Kiran

Sai Kiran :  ఒకప్పుడు సినిమాల్లో నటించి ‘నువ్వే కావాలి’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సాయి కిరణ్‌ ఇప్పుడు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంటూ వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న సాయి కిరణ్ తాజాగా తనను ఓ నిర్మాత తనని మోసం చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

Nirupam : భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు..

మన్న మినిస్ట్రీస్‌ గ్రూప్‌లో సభ్యత్వం పేరుతో నిర్మాతలు జాన్‌ బాబు, లివింగ్‌ స్టెన్‌ తన దగ్గర్నుంచి రూ.10.6 లక్షలు తీసుకున్నారని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసి తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వమన్నాను అని, డబ్బులు ఇవ్వకుండా వారిద్దరూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయికిరణ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో జాన్‌ బాబు, లివింగ్ స్టెన్‌లపై 420, 406 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.