‘గాల్లో పతంగి మల్లే ఎగిరే కలలే నావి’.. అంటున్న చైతు..
యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్స్టోరి’ మూవీ నుండి ‘ఏయ్ పిల్లా’ లిరికల్ సాంగ్..
యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్స్టోరి’ మూవీ నుండి ‘ఏయ్ పిల్లా’ లిరికల్ సాంగ్..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘లవ్ స్టోరి’.. రీసెంట్గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు..(బన్నీ పక్కన పూరి పోరి.. ‘అహా’ కోసం అదిరే ప్రమోషన్..)
‘‘ఏయ్ పిల్లా.. పరుగున పోదామా.. ఏ వైపో.. జంటగ ఉందామా.. రా రా.. కంచే దుంకి చక చక ఉరుకుతూ.. ఆ రంగుల విల్లుని తీసి.. ఈ వైపు వంతెన వేసి.. రావా.. ఎన్నో తలపులు.. ఏవో కలతలు.. బతుకే పోరవుతున్నా.. గాల్లో పతంగి మల్లే ఎగిరే కలలే నావి.. ఆశ నిరాశల ఉయ్యాలాటలు.. పొద్దూ మాపుల మధ్యే.. నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే’’.. అంటూ సాగే ఈ కూల్ మెలోడి ఆకట్టుకుంటోంది. పవన్ ట్యూన్కి చైతన్య పింగళి లిరిక్స్ రాయగా.. హరి చరణ్ పాడారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘లవ్స్టోరి’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు. నిర్మాతలు : నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావ్, సగీతం : పవన్ సిహెచ్, కెమెరా : విజయ్ సి కుమార్, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్.