Baahubali 2: ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి-2.. ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్‌సెట్టర్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బాహుబలి-2 మూవీని సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

Baahubali 2: ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి-2.. ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్‌సెట్టర్!

Baahubali 2 Completes Six Years

Baahubali 2: ‘బాహుబలి’.. పరిచయం అవసరం లేని తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి-2 కూడా వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా జక్కన్న తెరకెక్కించడంతో ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు పట్టం కట్టారు. అప్పటివరకు తెలుగు సినిమా అంటే ఓ ప్రాంతీయ సినిమాగా చూసిన నార్త్ ఆడియెన్స్, బాహుబలి దెబ్బకు దాసోహం అన్నారు.

Baahubali: తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని రోజు..!

ఈ ఎపిక్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సినిమాల రికార్డులను లేపేసి, బాహుబలి-2 క్రియేట్ చేసిన సెన్సేషన్‌కు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాను ఫిక్షనల్ కథతో తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అంతర్జాతీయంగా బాహుబలి-2 మూవీ తన సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది.

OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

ఇక బాహుబలి-2 క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఇప్పటికీ చర్చలు సాగుతున్నాయి. ఇంతలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మార్క్ వేసుకున్న బాహుబలి-2 రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. బాహుబలి-2 రికార్డులను ఏ సినిమా బద్దలుకొడుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ ఎపిక్ సినిమాలో రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.