Puneeth Rajkumar: పునీత్ చివరిచూపు కోసం బెంగుళూర్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్!!

కన్నడ సినీ ప్రేమాయణం ముగించుకుని, అకాల మరణం చెందిన పునీత్ రాజ్‌కుమార్ కోసం యావత్ సినీ పరిశ్రమ, అభిమానులు తరలివస్తున్నారు.

Puneeth Rajkumar: పునీత్ చివరిచూపు కోసం బెంగుళూర్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్!!

Punith Ntr Bala

Puneeth Rajkumar: కన్నడ సినీ ప్రేమాయణం ముగించుకుని, అకాల మరణం చెందిన పునీత్ రాజ్‌కుమార్ కోసం యావత్ సినీ పరిశ్రమ, అభిమానులు తరలివస్తున్నారు. యావత్ సినిమా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పునీత్ చివరిచూపు కోసం కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు అభిమానులు.

కంఠీరవ స్టేడియం అభిమానుల సంద్రంతో నిండిపోయింది. కర్ణాటకలోని వేలాది మంది పిల్లలు, యువకులు మరియు వృద్ధులు చివరి చూపు కోసం క్యూలో నిలబడి ఉన్నారు. అభిమాన కథానాయకుడి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు.. బారికేడ్లు తోసుకుని అభిమానులు వస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు.. కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు. పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు టాలీవుడ్ నుంచి మధ్యాహ్నం నందమూరి హీరోలు.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లనున్నారు.

సాయంత్రం కంఠీరవ స్టేడియానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లనున్నారు. బెంగళూరుకు విమానంలో చేరుకుని, విమానాశ్రయం నుంచి కారులో స్టేడియంకు వెళ్లనున్నారు చిరంజీవి.. ఇప్పటికే మా మాజీ అధ్యక్షుడు నరేష్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ కూడా అక్కడికి చేరుకున్నారు.