తమ్ముడిగా నటించాడు.. మర్చిపోలేక పోతున్నా..
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా మర్చిపోలేక పోతోంది. అతడి మరణవార్తను ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీరిద్దరూ ‘ధోనీ(ది అన్టోల్డ్ స్టోరి)’ సినిమాలో అక్కాతమ్ముళ్లుగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. సుశాంత్ ఆత్మహత్యపై గతంలోనే స్పందించిన భూమిక తాజాగా మరోసారి అతడిని గుర్తు చేసుకుంటూ.. ఓ భావోద్వేగ లేఖను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘దాదాపు 20 రోజులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నా. ఎందుకో అర్థం కావడం లేదు.. ఓ సినిమా కోసం కలిసి పనిచేసిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నా. అవును.. నేను అంగీకరిస్తా.. ఇక్కడ కొనసాగడం అంత సులభం కాదు. ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులూ ఉంటారు. మనల్ని గౌరవించే వారూ ఉంటారు. వ్యతిరేకించే వారూ ఉంటారు. మనల్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని మరిచి ముందుకు సాగినపుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదేమైనా గుడ్ బై సుశాంత్.. నువ్వెక్కడున్నా నీ కోసం ప్రార్థిస్తుంటా’ అంటూ భూమిక ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
https://www.instagram.com/p/CCLegm6BTQe/?utm_source=ig_web_copy_link
Read:మరో ఇద్దరు తెలుగు సీరియల్ నటులకు కరోనా.. రవికృష్ణ, సాక్షి శివకు పాజిటివ్